ఈ వార్తను అనువదించండి:
మున్సిపల్ కమిషనర్లు: ఏపీలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలోని 24 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ చేసింది చంద్రబాబు సర్కార్. కమిషనర్ల బదిలీపై మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు కమిషనర్లను మాతృశాఖకు బదిలీ చేసింది ప్రభుత్వం. మరికొంతమంది కమిషనర్లను మున్సిపల్ శాఖ డైరెక్టర్ కు రిపోర్ట్ చేయాలని వెల్లడించింది.