ఈ వార్తను అనువదించండి:

గద్దర్ అవార్డులు: గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ అవార్డులకు సంబంధించిన లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలను కమిటీ సభ్యులు ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గద్దర్ అవార్డుల కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్‌గా దిల్ రాజు ఎన్నికయ్యారు. గద్దర్ అవార్డుల కమిటీ సలహాదారులుగా కె.రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరిణి, డి.సురేష్ బాబు, చంద్రబోస్, నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణునును నియమించారు.

పూర్తిగా చదవండి..