Mr.Bachchan: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు నటిగా పరిచయమయ్యారు భాగ్యశ్రీ బోర్సే. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమెకు మాత్రం ఈ సినిమా మంచి సక్సెస్ అందించలేకపోయింది అయితే తాజాగా ఈమె మిస్టర్ బచ్చన్ సినిమా కోసం మరొక సూపర్ హిట్ సినిమాని రిజెక్ట్ చేసి ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది.

మరి ఈమె మిస్ చేసుకున్న ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..గ‌త ఏడాది బాలీవుడ్ లో యారియాన్ 2, చందు ఛాంపియన్ వంటి చిత్రాల్లో పెద్ద‌గా గుర్తింపు లేని పాత్ర‌ల‌ను పోషించిన భాగ్య‌శ్రీ బోర్సేకి టాలీవుడ్ లో మొద‌ట ఆయ్ మూవీలో యువ హీరో నార్నె నితిన్ కి జోడిగా న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

ఆయ్…
ఇలా ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ ఈమె మాత్రం ఈ మూవీని పక్కన పెట్టి రవితేజ సినిమాకు కమిట్ అయ్యారు. కట్ చేస్తే రవితేజ సినిమా ఫ్లాప్ అవ్వగా ఆయ్ మూవీ మాత్రం ఎంతో మంచి సక్సెస్ అయింది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది బ్యాడ్ లక్ అంటే ఇదే కాబోలు అంటూ ఈమెపై సింపతి చూపిస్తున్నారు.