ఈ వార్తను అనువదించండి:

తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ రావడం ఖాయమైంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని తాను హైకమాండ్ ను కోరినట్లు కొద్ది రోజుల క్రితం ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్.. పీసీసీ చీఫ్‌ ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ అగ్రనేతలతో చర్చిస్తున్నారు. అయితే.. గతంలోనూ ఈ విషయమై ఆయన అనేక సార్లు ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలతో చర్చలు జరిపినా.. ఏకాభిప్రాయం రాకపోవడంతో పేర్లు ఖరారు కాలేదు. అయితే.. ఈ సారి మాత్రం ఫైనల్ లిస్ట్ తోనే ఆయన రాష్ట్రానికి వస్తారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కాస్త ఆలస్యమైనా కూడా.. పీసీసీ చీఫ్‌ నియామకం మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్‌ ఎవరు? అన్న అంశంపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పూర్తిగా చదవండి..