ఈ వార్తను అనువదించండి:

ప్రధాని మోదీ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ఆయన భేటీ అయ్యారు. ముందుగా రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి మోదీ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు స్వాగతం పలికిన జెలెన్‌స్కీ ఆత్మీయ ఆలింగన చేసుకున్నారు. ఆ తర్వాత రష్యా దాడిలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. ఉక్రెయిన్‌ ఎదుర్కొన్న సంక్షోభాలకు సంబధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇరు దేశాధినేతలు వీక్షించారు.

పూర్తిగా చదవండి..