ఈ వార్తను అనువదించండి:

అచ్యుతాపురం: అచ్యుతాపురంలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై థర్డ్ పార్టీ కీలక విషయాలను బయటపెట్టింది. యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు నివేదికలో తెలిపింది. సంస్థలో ఉన్న లోపాలను గత ఏడాది ఇచ్చిన నివేదికలోనే చెప్పినట్లు థర్డ్ పార్టీ నివేదిక పేర్కొంది. గత నివేదికలో పైప్ లైన్‌ను తరచూ తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని చెప్పమని.. కానీ తాము ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా యాజమాన్యం పక్కకు పెట్టిందని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం పైప్ లైన్ నుంచి సాల్వెంట్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు వెల్లడించింది.

పూర్తిగా చదవండి..