Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి అమృత ప్రణయ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.

ఇలా అమృత ప్రణయ్ ఒక యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె తన జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన ద్వారా అందరికీ పరిచయమయ్యారు. కులాంతర వివాహం చేసుకోవడంతో నిండు గర్భిణీ అయిన తన తండ్రి ఈమె పట్ల కనికరించకుండా తన భర్తను నడిరోడ్డున నరికి చంపించడంతో అమృత ప్రణయ్ ఒక్కసారిగా వార్తలలో నిలిచారు.

అప్పటినుంచి తన కొడుకే లోకంగా బ్రతుకుతున్న అమృత ప్రణయ్ సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమంలోకి వెళ్తున్నానని వార్తలు వస్తున్నాయి ఇక ఈ విషయం గురించిన అత్త అమ్మ కూడా అడుగుతున్నారు అయితే నేను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు.

మధ్యలో వచ్చిన అలవాటు కాదు..
ఇక నేను ఇన్ని రోజులు వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఉంది తాను గత కొద్దిరోజులుగా చాలా మానసిక వేదనకు గురి అవుతున్నానని ఎవరైనా పలకరిస్తే చాలు కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయని తెలిపారు. ఇక తాను పొట్టి బట్టలు వేసుకుంటున్నానని చాలామంది విమర్శించారు. అయితే నన్ను మీరు చిన్నప్పటినుంచి చూడలేదు నేను చిన్నప్పటినుంచి కూడా ఇలాగే పెరిగానని, ఈ అలవాటు తనకు మధ్యలో వచ్చింది కాదు అంటూ తన పట్ల వస్తున్న విమర్శలపై కూడా ఈమె క్లారిటీ ఇస్తూ విమర్శలకు చెక్ పెట్టారు.