Samantha: సమంత అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. నాగ చైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈమె కొద్ది రోజులకే తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత ఒంటరిగానే సినిమాలలో నటిస్తున్నారు కానీ నాగచైతన్య మాత్రం నటి శోభిత ప్రేమలో పడ్డారు.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే నాగచైతన్య నిశ్చితార్థపు వేడుకలలో కేవలం అక్కినేని కుటుంబ సభ్యులు శోభిత కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా పాల్గొనలేదు.

రామానాయుడు కుమార్తె లక్ష్మి కొడుకే నాగచైతన్య అనే విషయం మనకు తెలిసిందే. ఇలా నాగచైతన్య కూడా స్వయంగా రామానాయుడుకి మనవడు వరుస అవుతారు. ఇలా తమ అల్లుడి నిశ్చితార్థం జరుగుతుంటే వెంకటేష్ గాని సురేష్ బాబు,రానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సమంతకు విడాకులు..
అయితే ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి సమంత కారణమంటూ మరొక వార్త కూడా హల్చల్ చేస్తోంది. నిజానికి సమంత నాగచైతన్య విడిపోవడం దగ్గుబాటి కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదట. నాగచైతన్య తల్లికి కూడా ఇది ఇష్టం లేదని తెలుస్తోంది. ఇలా నాగచైతన్య తప్పులవల్లే విడాకుల వరకు వెళ్లిందని అందుకే నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేని దగ్గుబాటి ఫ్యామిలీ ఆయన రెండో సారీ శోభితతో నిశ్చితార్థం చేసుకోవడం కూడా ఇష్టం లేకపోవడంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. బహుశా పెళ్లికి కూడా దగ్గుబాటి ఫ్యామిలీ హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.