Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. దీంతో ఈయన తన సినిమాలను కాస్త పక్కన పెట్టేశారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు. ఆ సినిమాలన్నీ కూడా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుని వాయిదా పడ్డాయి దీంతో ఆ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారన్న సందేహం ప్రతి ఒక్క అభిమాని లోను ఉంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలోనే ఈయన కమిట్ అయిన హరిహర వీరు మల్లు, ఓజి సినిమాల దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సినిమాల షూటింగ్ విషయంలో ఆయనతో చర్చలు జరిపినట్టు సమాచారం.

ఇలా సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలి అంటే ఇప్పుడు తనకు చాలా కష్టమని పవన్ కళ్యాణ్ చెప్పారట. అయితే ఆయన చెప్పిన ఈ కండిషన్ కి ఒప్పుకుంటే షూటింగ్స్ తొందరగా పూర్తి అవుతాయని దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకపోయిన ఇతరులపై చేసే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తున్నారు. అయితే పవన్ చేయబోయే సన్నివేశాలకు సంబంధించిన సెట్ మొత్తం తాడేపల్లి సమీపంలో వేస్తే తాను షూటింగ్స్ కి హాజరవుతానని తెలిపారు.

తాడేపల్లి లో షూటింగ్ సెట్..
ప్రస్తుతం ఈయన ఏపీ కార్యకలాపాలను నిర్వర్తిస్తూ తాడేపల్లి లోనే ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. షూటింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలి అంటే ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే తాడేపల్లి సమీపంలో సినిమా సెట్ వేస్తే కనుక తనకు వీలైనప్పుడల్లా సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తానని పవన్ నిర్మాతలకు చెప్పారట. ఈ విషయంలో దర్శక నిర్మాతలు కూడా ఒప్పుకున్నారని సమాచారం. త్వరలోనే పవన్ ఈ సినిమాల షూటింగ్స్ లో బిజీ కానున్నారని తెలుస్తోంది.