ఈ వార్తను అనువదించండి:
ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ త్వరలోనే జన్ సురాజ్ అభియాన్ను రాజకీయ పార్టీగా మార్చనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న జన్ సురాజ్ను పార్టీగా మారుస్తామని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా పీకే సంచలన ప్రకటన చేశారు. 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో జన్ సరాజ్ పోటీ చేస్తోందని వెల్లడించారు. ఇందులో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులే ఉంటారని పేర్కొన్నారు. ఇక 2030లో కనీసం 70 నుంచి 80 మంది మహిళా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు.