ఈ వార్తను అనువదించండి:

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఫేక్‌ గ్యారెంటీల కుంభకోణం సంచలనంగా మారింది. యూరో ఎగ్జిమ్ బ్యాంకు తీగ లాగితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడా కాంట్రక్టర్ల డొంక కదులుతోంది. దీంతో పొంగులోటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పొంగులేటి వేల కోట్లల్లో మోసం చేశారని RTV బయటపెట్టిన కథనాలు చర్చనీయాంశమవుతున్నాయి . APSPDCLతో పాటు APEPDCLతోనూ పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ఒప్పందం చేసుకుంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు APSPDCL నుంచి రూ.2,451 కోట్లు, అలాగే APEPDCL నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కాయి. మొత్తంగా వీటి విలువ రూ.4,500 కోట్లు.

పూర్తిగా చదవండి..