ఈ వార్తను అనువదించండి:

లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 7 గంటలకు ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. దీంతో బీఆర్ఎస్‌ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కవితకు బెయిల్ రావడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్‌ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. కాంగ్రెస్, ఆ పార్టీ లాయర్ల వల్లే కవితకు బెయిల్ రావడం సాధ్యమైందని అన్నారు. కవితకు బెయిల్ రావడం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల సమిష్టి విజయమని తెలిపారు. కవితకు గతంలో బెయిల్ కోసం వాదించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభకు వెళ్తున్నారని అన్నారు.

పూర్తిగా చదవండి..