ఈ వార్తను అనువదించండి:

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు కవిత సోదరుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హడావుడిగా సుప్రీం కోర్టు నుంచి తిహార్‌ జైలుకు బయల్దేరారు. అయితే ఢిల్లీ ట్రాఫిక్‌ జామ్‌ లో కారు ఇరుక్కుపోవడంతో వెంటనే కారు దిగిన కేటీఆర్.. ప్యాసింజర్ ఆటో ఎక్కారు. కేటీఆర్ తో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.

పూర్తిగా చదవండి..