ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు ఈ రోజు ఉదయం ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 166 రోజుల జైలు జీవితం అనంతరం కవిత విడుదలయ్యారు. కవిత అన్న కేటీఆర్, హరీశ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు తీహార్ జైలు వద్దకు వెళ్లి ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి కవిత ఢిల్లీలోనే ఉండనున్నారు. అనంతరం రేపు ఉదయం ఢిల్లీలో ప్రెస్ తో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ ను కవిత కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

పూర్తిగా చదవండి..