ఈ వార్తను అనువదించండి:

TG న్యూస్: తెలంగాణలో మరోసారి ప్రజాపాలన చేపట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ప్రజాపాలన నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మరోసారి సెప్టెంబర్‌ 17 నుంచి 10 రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. రాష్ట్రంలో పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో కూడిన హెల్త్ కార్డులను ప్రతీ పౌరుడికి అందించేందుకు క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పూర్తిగా చదవండి..