తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సారి ఫైర్ అయ్యారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడుతున్నట్లు ఈ రోజు రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది? అంటూ రేవంత్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద రేవంత్ ఒలకబోస్తున్న కపట ప్రేమ.. అసలు రంగు అందరికీ తెలుసన్నారు. నీ ఆలోచనల్లో కుసంస్కారం.. నీ మాటలు అష్ట వికారం అంటూ రేవంత్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి ఏర్పాటు కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా.. అది అవమానమేనన్నారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో ఇప్పుడు అట్లుంటదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ”మళ్ళీ చెప్తున్నాం.. రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం” అంటూ రేవంత్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్.

The post రాసి పెట్టుకో రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్ appeared first on Rtvlive.com.