Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీతో ఈయనకు తార స్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మెగా అభిమానులు అలాగే అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తుంది.

ఈ విధంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరమవుతున్న నేపథ్యంలో మెగా ఫాన్స్ పుష్ప2 సినిమాని టార్గెట్ చేస్తున్నారు అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పక్కాగా ప్లాన్స్ వేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిత్యం అభిమానులకు అందుబాటులో ఉండేలా ఈయన చర్యలు చేపడుతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తన ఇంటి నుంచి ఈయన దూరంగా వెళ్ళబోతున్నారని మైత్రి మూవీస్ ఆఫీస్ కి దగ్గర్లో ఈయన మరో కొత్త ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది. దాదాపు 3000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఇండ్లు అన్ని సౌకర్యాలతో కూడుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం అభిమానులు వస్తే బయట నిలబడాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారట.

ఇలా అన్ని సౌకర్యాలతో ఎంతో అద్భుతంగా ఈ ఇల్లు ఉండబోతుందని ఇప్పటికే ఈ ఇంటి పనులు 70 శాతం పూర్తి అయ్యాయని తెలుస్తోంది. అతి త్వరలోనే అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి ఈ ఇంట్లోకి వెళ్ళబోతున్నారని సమాచారం. అయితే తాజాగా ఈ ఇంటికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇలాంటి కాస్ట్లీ ఇల్లు కొనుగోలు చేయలేదని సమాచారం.

200 కోట్లు..
ఇలా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్న ఈ ఇంటి కోసం అల్లు అర్జున్ ఏకంగా 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో ఇల్లు కూడా ఇంత ఖరీదైనది లేదని తెలుస్తుంది. ఇక ఈ ఇంటికి సమీపంలోనే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ అలాగే నటుడు కృష్ణంరాజు ఇల్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పుష్ప సినిమా కోసం ఏకంగా ఈయన మకాం మారుస్తూ సినిమా ప్రమోషన్లను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.