జేత్వాని: ఏపీలో ముంబై హీరోయిన్ జెత్వాని కేసు సంచలనంగా మారింది. కీలక వైసీపీ నేత, కొందరు ఐపీఎస్‌ల వేధింపులపై విచారణ కోసం హీరోయిన్ జెత్వాని విజయవాడకు చేరుకున్నారు. ఆధారాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును కలవనున్నారు. అనంతరం విచారణ అధికారి ఏసీపీ స్రవంతి రాయ్‌తో భేటీ కానున్నారు.

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్‌!

హీరోయిన్‌ కేసుపై 4 రోజుల్లో డీజీపీకి, సీపీకీ నివేదిక అందించనున్నారు. నన్ను, నా కుటుంబ సభ్యుల్ని కీలక వైసీపీ నేత, కొందరు ఐపీఎస్‌ అధికారులు అన్ని రకాలుగా వేధించారని జెత్వాని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవర్నీ వదలిపెట్టను, అందర్నీ బయటకు లాగుతానని జెత్వాని తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వంపై తనకు నమ్మకముందని.. తనకు న్యాయం జరుగుతుందని జెత్వాని తెలిపింది.

The post AP: ఏపీలో సంచలనంగా ముంబై హీరోయిన్ జెత్వాని కేసు..! appeared first on Rtvlive.com.