Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటక టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన తన స్నేహితుడు, దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే మరో డైరెక్టర్ రిషిబ్ శెట్టితో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ముఖాంబిక అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. ఇలా ఈ ముగ్గురు సతీసమేతంగా ఆలయాలను దర్శించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

స్వయంగా నటుడు రిషబ్ శెట్టి ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఎన్టీఆర్ కుటుంబానికి ఘన స్వాగతం పలికి వారిని ఆహ్వానించారు అప్పటినుంచి పలు ఆలయాలకు వెళ్తూ ఉన్నారు . ఎంతో ట్రెడిషనల్ లుక్ లో పంచ కట్టుకొని ఎన్టీఆర్ ఇలా దైవదర్శనాలకు వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలను చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే నటుడు రిషబ్ శెట్టి ఇటీవల కాంతార సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా రాబోతున్న చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మీడియా ఎన్టీఆర్ ను ప్రశ్నించారు.

రెడీగా ఉన్నాను..
కాంతారా ప్రీక్వెల్ లో మీరు నటిస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయని మీడియా ప్రశ్నించగా.. రిషబ్ శెట్టి దాని గురించి ప్లాన్ చేయాలి. ఆయన ప్లాన్ చేస్తే చేయడానికి రెడీగా ఉన్నానని ఎన్టీఆర్ నవ్వుతూ సమాధానం చెప్పారు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారని, అందుకే ఇలా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు అంటూ పలువురు ఈ కామెంట్లపై మరిన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయన నటించిన దేవర సినిమా ఈనెల 27వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.