ఈ వార్తను అనువదించండి:

పశ్చిమ బెంగాల్‌లో ఆల్‌ ఇండియా తృణముల్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ న్యూస్‌ ఛానల్స్‌ ఏబీపీ అనంద, రిపబ్లిక్ టీవీ, టీవీ9 ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. బెంగాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తమ ప్రతినిధులను ఈ మూడు ఛానల్స్‌లకు పంపించమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ” బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో నిరంతరం ప్రచారాలు చేస్తున్న ఏబీపీ అనంద, రిపబ్లిక్, టీవీ9 ఛానల్స్‌కు తమ ప్రతినిధులను పంపించకూడదని ఏఐటీఎంసీ నిర్ణయించింది. ఈ ఛానల్స్‌ను నడిపించేవారు, వారి ప్రమోటర్లు ఈడీ కేసులను, విచారణలను ఎదుర్కొంటున్నారు. అందుకే వీళ్లకు ఢిల్లీ జమిందారులను బుజ్జగించాల్సిన అవసరం ఉంది.

పూర్తిగా చదవండి..