Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా 14 మంది కంటెస్టెంట్లను నాగార్జున హౌస్ లోకి పంపించారు. ఈసారి ఒక్కొక్కరిని కాకుండా జోడిగా హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.

ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లో హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి వారి మధ్య టాస్కులు అలాగే గొడవలు పోట్లాటలు కూడా మొదలయ్యాయి. ఇకపోతే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు అంటూ మొదటి నుంచి కూడా బర్రెలక్క పేరు పెద్ద ఎత్తున వినబడింది. ఈమె తెలంగాణలోని ఎన్నికలలో పోటీ చేసి ఎంతో పాపులర్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బర్రెలక్క అలియాస్ శిరీష పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇక ఈ వార్తల పట్ల ఈమె స్పందించి నాకు ఇటీవల కాలంలో ఫేమ్ తగ్గిందన్న ఉద్దేశంతోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తనను ఎంపిక చేయలేదని అయినా బిగ్ బాస్ లోకి వెళ్లకపోయినా నాకు వచ్చిన నష్టమేమీ లేదు అంటూ ఈ కార్యక్రమం గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈమెను ఈ సీజన్ కంటెస్టెంట్ గా ఇప్పుడు పంపించకపోయిన, ఈమె ఎంట్రీని చాలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారని సమాచారం.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
ఎప్పటిలాగే అందరిని ఒకేసారి కాకుండా గత సీజన్ లాగా మొదట కొంతమంది కంటెస్టెంట్లను అలాగే కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరి కొంత మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే అయిదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో బర్రెలక్క పేరు ఉందని సమాచారం. మరి వైల్డ్ కార్డు ద్వారా ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.