ఈ వార్తను అనువదించండి:

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక(Anti-Rape) బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో సవరణలు చేసిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్‌ బిల్‌ 2024 అనే పేరుతో దీదీ సర్కార్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా ఓ వ్యక్తిపై లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడినప్పుడు ఈ ఘటనలో బాధితులు చనిపోయినా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లైతే దోషులకు మరణ శిక్ష విధిస్తారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు అపరాజిత టాస్క్ ఫోర్స్‌ దీనిపై ఓ నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత 21 రోజుల్లోనే దోషులకు మరణ శిక్ష పడుతుంది.

పూర్తిగా చదవండి..