ఈ వార్తను అనువదించండి:

మావోయిస్టు: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు.. అలియాస్ జగన్ (రణదేవ్ దాదా) మృతి చెందినట్లు తెలుస్తోంది. కేంద్ర మిలిటరీ ఇన్‌చార్జ్ తోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ బార్డర్ ఇన్‌చార్జ్‌గా రణదేవ్ పనిచేస్తున్నారు. రణదేవ్ స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం. జగన్‌పై ఇప్పటికే రూ. 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జగన్‌తో పాటు మరో ఎనిమిది మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

పూర్తిగా చదవండి..