ఈ వార్తను అనువదించండి:
కేసీఆర్ కు భారీ షాక్ – హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ (కేసీఆర్), హరీష్ రావు (హరీష్ రావు), స్మితా సబర్వాల్ (స్మితా సబర్వాల్) కు బిగ్ షాక్ తగిలింది. వీళ్లకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ (మేడిగడ్డ బ్యారేజీ) కుంగడంతో ప్రజా ధనానికి భారీ నష్టం జరిగిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, స్మితా సబర్వాల్కు నోటీసులు పంపిన న్యాయస్థానం.. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే ఎమ్మెల్యే హరీష్రావు, మేగా కృష్ణారెడ్డి, రజత్కుమార్, ఎల్అండీటీ ఎండీ సురేష్కుమార్, ఇరిగేషన్ చిఫ్ ఇంజినీర్లు హరి, రామ్కు సైతం నోటీసులు జారీ చేసింది.