ఈ వార్తను అనువదించండి:

భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా తెలంగాణ, ఏపీకి కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ చింగ్‌ చౌహాన్‌తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించింది. ఈ పర్యటనలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. తాజాగా తెలంగాణ సెక్రటేరియట్‌లో కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ సీఎం రేవంత్‌ను కలిశారు. అలాగే వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌కు పరిశీలించారు.

పూర్తిగా చదవండి..