ఈ వార్తను అనువదించండి:

వరదలు: ఆంధ్ర ప్రదేశ్ లో వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనుంది చంద్రబాబు సర్కార్. కిట్లను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పంపిణీ చేయనున్నారు. మొదటి రోజు 50 వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార పంపిణీ చేయనున్నారు. అలాగే 2 కిలోల ఉల్లి, 2 కిలోల బంగాళదుంపలు, లీటరు నూనెతో కూడిన కిట్‌ అందించనున్నారు. 2 లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ-పోస్‌ మిషన్‌ ద్వారా సరకుల పంపిణీ చేయనున్నారు. రేషన్‌ కార్డులు లేని వారికి ఆధార్‌ లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేయనుంది బాబు సర్కార్.

పూర్తిగా చదవండి..