Eluru: ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయగా…కొద్ది రోజుల క్రితం మేయర్‌ దంపతులు నూర్జహాన్‌, పెదబాబు పార్టీని వీడారు. వీరి బాటలోనే తాజాగా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ కూడా వచ్చి చేరారు.

ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా పార్టీకి రాజీనామా చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏలూరు జిల్లాలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయ్యింది. మిగిలిన పార్టీ నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో పార్టీలు మారడంలో ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పాలి.

Also Read:  నీట మునిగిన ఏలూరు-కైకలూరు రహదారి!

The post Eluru: ఏలూరులో వైసీపీకి మరో ఎదురు దెబ్బ! appeared first on Rtvlive.com.