ఈ వార్తను అనువదించండి:

కాంగ్రెస్‌ సీనియర్ నేత మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు పార్టీ హైకమాండ్‌ కొత్త పీసీసీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు పార్టీలో సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో పార్టీ నాయకులు, కేడర్ల మధ్య పటిష్టంగా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు పీసీసీ చీఫ్‌ యాక్టివ్‌గా కో ఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య మెరుగైన సంబంధాలు నిర్మించడం, అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వా్మ్యం చేయించాల్సి బాధ్యత పీసీసీ చీఫ్‌కే ఉంటుంది.

పూర్తిగా చదవండి..