ఠాగూర్ సినిమా గుర్తింది కదా..? లంచగొండుల గుండెలో నిదురించిన సింహంలా మెప్పించిన చిరంజీవి బాక్సాఫిస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాడు. అయితే అదంతా సినిమా.. కానీ రియల్ లైఫ్లోనూ ఓ ఠాగూర్ ఉన్నారు. అది కూడా మన తెలంగాణలోనే..! లంచాలు తీసుకుంటున్నవారి భరతం పడుతున్నారాయన. తెలంగాణ ఏసీబీ డీజీగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ దెబ్బకు లంచగొండు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లంచాలు తీసుకోవాలంటేనే ప్రభుత్వ అధికారులు హడలిపోయారు. నిత్యం ఎక్కడో ఒక చోటా బడా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కుతుండడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ లంచం…అదే సగటు భారతీయుడి ఆవేదన.. అదే సీవీ ఆనంద్ ఆవేదన కూడా.. అవినీతిని అంతం చేసేందుకు ఆయన ఫుల్ యాక్టివ్ అయ్యారు. అందుకే ఏసీబీ ద్వారా లంచగొండుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్నారు. నిజానికి ప్రజల్లో ఏసీబీ పట్ల ఒక అభిప్రాయం ఉంది. ఏసీబీ కేవలం చిన్నచిన్న ప్రభుత్వ అధికారులనే పట్టుకుంటుందని.. పెద్ద పెద్ద తిమింగలాలను పట్టించుకోదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇదంతా రాంగ్ అని ప్రూవ్ చేశారు సీవీ ఆనంద్. ఏసీబీ వలలో చిక్కుతున్న లంచగొండు అధికారుల్లో దాదాపు అన్ని పెద్దచేపలే కనిపిస్తున్నాయి.
ఇది ఎసిబికి మరియు నాకు, మేము సరైన దారిలో ఉన్నామని విశ్వాసాన్ని కలిగిస్తుంది! https://t.co/yaDE9p3TLz
— CV ఆనంద్ IPS (@CVanandIPS) సెప్టెంబర్ 4, 2024
5 వేలు, 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ అధికారుల గురించి వింటూ వస్తున్న జనాలకు చాలా రోజులుగా లక్షలు రూపాయలు తీసుకుంటూ దొరుకుతున్న అధికారులను కనిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏసీబీని తెగ మెచ్చుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే లంచం తీసుకున్న అధికారులు ఆ డబ్బును తిరిగి సంబంధిత వ్యక్తికి ఇచ్చేస్తుండడం విడ్డూరం. ఠాగూర్ సినిమాలోనూ ఇదే జరిగింది. ఇక్కడ తెలంగాణలోనూ అదే జరుగుతోంది. లంచం తీసుకోవాలంటేనే అధికారులు వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా పోలీసు అధికారులు లంచం ఇచ్చినవారి కోసం వెతికి మరీ స్వయంగా వారి ప్లేస్లకు వెళ్లి డబ్బులు వాపస్ ఇస్తున్నారు!
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ వై.మదన్ మోహన్రెడ్డి ఎంవీ భూపాల్ రెడ్డిని ఏసీబీ ట్రాప్ చేసి అరెస్టు చేసింది. తొలగింపు కోసం ఫిర్యాదుదారు నుంచి రూ.8,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. pic.twitter.com/6cN2qastGH
— CV ఆనంద్ IPS (@CVanandIPS) ఆగస్టు 13, 2024
సీవీ ఆనంద్ తెలంగాణ క్యాడర్కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన డిసెంబర్ 24, 2021 నుంచి అక్టోబర్ 12, 2023 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించారు. ఇక 2017లో అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి అందుకున్నారు. అడిషనల్ డీజీగా ఉన్నా సీవీ ఆనంద్కు డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్ట్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత సీవీ ఆనంద్ కొత్త బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏసీబీ డీజీగా ఆయన్ను రేవంత్ సర్కార్ నియమించింది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ డి.నరేందర్పై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.
అతని నివాసం మరియు ఇతర ప్రదేశాలలో సోదాలు రూ. 6.7 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి, ఇందులో రూ. 2.93 కోట్ల నగదు, బ్యాంకులో ₹ 1.1 కోట్లు, 51 తులాల… pic.twitter.com/Mnz94EEiX1
— CV ఆనంద్ IPS (@CVanandIPS) ఆగస్టు 9, 2024
అయితే.. అత్యంత కీలకమైన హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల సమస్యలు నిత్యం తలెత్తుతుండడంతో ఆయనను నగర కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. గత ఎన్నికల ముందు వరకు కూడా ఆయన హైదరాబాద్ సీపీగా పని చేశారు. కానీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయనను ఈసీ బాధ్యతల నుంచి తప్పించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆనంద్ ను ఏసీబీ చీఫ్ గా నియమించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనను తిరగి హైదరాబాద్ సీపీగా నియమించింది ప్రభుత్వం. ఏసీపీ డీజీగా విజయ్కుమార్ ను నియమించింది. అయితే.. ఆనంద్ వెళ్లిన తర్వాత కూడా ఏసీబీ ఇప్పటి దూకుడునే కొనసాగిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఎ.వెంకటేశం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్; సైబరాబాద్ కమిషనరేట్లోని సూరారం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పట్టుకున్నారు #ఏసీబీ అధికారులు గాజులరామారం గ్రామంలోని తన భూమిలో అభివృద్ధి పనులకు అనుమతించినందుకు ఒక వ్యక్తి నుండి రూ.5,00,000/- డిమాండ్ చేసి రూ.1,00,000/- స్వీకరించినందుకు. ఇన్స్పెక్టర్ కలిగి ఉంది… pic.twitter.com/vvcp2KJLky
— ACB తెలంగాణ (@TelanganaACB) జూన్ 21, 2024
రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి.వీరస్వామి, షేక్ షఫీ, ఎస్ఐలు పట్టుకున్నారు. #ఏసీబీ అధికారులు వద్ద #కుషాయిగూడ పోలీస్ స్టేషన్ అంగీకరించడం కోసం #లంచం కేసును మూసివేయడానికి ₹ 3,00,000/- మొత్తం. లంచం మొత్తాన్ని ఎల్. ఉపేందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా స్వీకరించారు. pic.twitter.com/hESkg8fmW3
— ACB తెలంగాణ (@TelanganaACB) మే 31, 2024
రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి.వీరస్వామి, షేక్ షఫీ, ఎస్ఐలు పట్టుకున్నారు. #ఏసీబీ అధికారులు వద్ద #కుషాయిగూడ పోలీస్ స్టేషన్ అంగీకరించడం కోసం #లంచం కేసును మూసివేయడానికి ₹ 3,00,000/- మొత్తం. లంచం మొత్తాన్ని ఎల్. ఉపేందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా స్వీకరించారు. pic.twitter.com/hESkg8fmW3
— ACB తెలంగాణ (@TelanganaACB) మే 31, 2024
ఇక సీవీ ఆనంద్ మంది క్రికెటర్ కూడా. భారత్ తరుఫున అండర్- 19 టీమ్లో సభ్యుడిగా ఉన్నారు ఆనంద్. ఇక హైదరాబాద్ అండర్ – 19, అండర్-22 జట్టులో ఆడారు. అటు టెన్నిస్లోనూ రాణించారు. అల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్లో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో అథెటిక్స్ విభాగంలో 8 గోల్డ్ మెడల్స్ గెలిచారు. ఇలా అటు క్రీడాలలోనూ ఇటు వివిధ హోదాల్లో పని చేసిన ప్రభుత్వ అధికారిగానూ సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తూ ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నారు.
హాయ్, ఈ స్కూల్ మేట్ ఎవరు?
అవును , నేను 100 mts , 200 mts , హై జంప్ , లింగ్ జంప్ మరియు ట్రిపుల్ జంప్ – 5 ఈవెంట్లు చేసేవాడిని – కాలేజ్లోనే మరియు నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ అథ్లెట్ని. నా 100 mts టైమింగ్ 11.2 సెకన్లు. ఇవి నా అథ్లెటిక్స్ పతకాలు https://t.co/B0hQDSrJFe pic.twitter.com/KG9niRvfas— CV ఆనంద్ IPS (@CVanandIPS) ఆగస్ట్ 8, 2024
[vuukle]