Madhubala: ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో కుర్రాళ్ళ కలల రాకుమారి అయిన స్టార్ హీరోయిన్ మధుబాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 90 దశకంలో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది మధుబాల. 1991లో కే బాలచందర్ దర్శకత్వం వహించిన అళగన్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఏమి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా టాప్ హీరోల సరే నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల హీరోయిన్ మధుబాల.

ఇక రోజా సినిమాతో ఈమె ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ ను సృష్టించింది. అరవింద్ స్వామి సరసన నటించి మెప్పించింది మధు. అమాయకమైన నటన, చూపు తిప్పుకోనివ్వని అందమైన రూపంతో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. రోజా సినిమాతోనే అప్పట్లో యూత్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మధు ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయింది.

అలా కొంతకాలం పాటు ఆమె కెరియర్ లో మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఇక తెలుగులో చిలక్కొట్టుడు, ఆవేశం, గణేష్, అల్లరి ప్రియుడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మధు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు జుహీ చావ్లా బంధువు ఆనంద్ ను వివాహం చేసుకుంది. 1999 ఫిబ్రవరి 19న వీరి పెళ్లి జరిగింది. వీరిద్దరికి అమెయా, కెయా అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మధు, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సినిమాల్లో యువ హీరోహీరోయిన్లకు తల్లిగా, వదినగా నటిస్తోంది. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది మధు. కొన్ని రోజుల క్రితం ప్రేమదేశం, శాకుంతలం, ఈగల్ చిత్రాల్లో కీలకపాత్రలలో నటించిన మధు ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప మూవీలో కీలకపాత్ర పోషిస్తుంది.

నెట్టింట ఫోటోస్ వైరల్..

ఇదిలా ఉంటే మధుబాల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఇద్దరు కూతుర్లతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేసింది. మధుబాల కుమార్తెలు అమెయా, కెయా ఇద్దరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్న మధు కుమార్తెల ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అచ్చం హీరోయిన్స్ మాదిరిగానే ఉన్నారని.. తల్లి అందానికి మించి చూడముచ్చటగా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా బాబు అచ్చం తల్లి పోలికే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. మరి మధుబాల తన కూతుర్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందా లేకుంటే వాళ్లకు నచ్చిన ఫీల్డ్ లోకి పంపిస్తుందా అన్నది చూడాలి మరి.

https://www.instagram.com/p/C_gw87hI0hw/?utm_source=ig_embed&ig_rid=bb04cca4-79ad-46e4-92b7-caab338c3b7e