ఈ వార్తను అనువదించండి:

హైడా: హైడ్రా దూకుడు పెంచింది. అక్రమకట్టడలపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు అధికారులు. బాచుపల్లి బౌరంపేట, బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద అనుమతులు ఉన్నాయని.. ఒకవేళ బఫర్ లేదా FTL జోన్ లో ఉందని ముందే తెలిసి ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది?.. ఎందుకు పన్నులు కట్టించుకుంటున్నారు అని బాధితులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పూర్తిగా చదవండి..