ఈ వార్తను అనువదించండి:

కేసీఆర్: తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడివుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాపక్షం నిలిచి ధిక్కారమే జీవితంగా స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ అని కేసీఆర్ కొనియాడారు. పుట్టుక.. చావుల మధ్య బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

పూర్తిగా చదవండి..