Lavanya -Raj tarun: సినీ నటుడు రాజ్ తరుణ్ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన లావణ్య అనే అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకొని తనకు కడుపు చేయడమే కాకుండా అబార్షన్ కూడా చేయించారని, ఇప్పుడు వేరే హీరోయిన్ లో మోజులో పడి తనని వదిలేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

ఇక ఈ విషయంపై ఈమె పోలీసులకు కేసు నమోదు చేసి పలు ఆధారాలను కూడా చూపించారు అంతేకాకుండా రాజు తరుణ్ కి సంబంధించి ఎన్నో విషయాలను కూడా బయటపెట్టారు. దీంతో రాజ్ తరుణ్ లావణ్య చెప్పేవన్నీ కూడా ఆపద్దాలేనని ఆమె డ్రగ్స్ కు బానిస అయిందని కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుందంటూ ఆయన కూడా పలు విషయాలు వెల్లడించారు.

తాజాగా వీరి వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. లావణ్య రాజ్ తరుణ్ పై దొంగతనం కేసును నమోదు చేసింది. తన ఇంట్లో 12 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు పోయాయి అంటూ ఈమె రాజ్‌తరుణ్‌, మాల్వీపై కేసు నమోదు చేసింది. తన తాళితో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అలాగే రాజు తరుణ్ తనకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా దొంగలించారని తెలిపారు..

తాళిబొట్టు..
నాలుగు నెలల క్రితం తాను జైలుకు వెళ్ళినప్పుడు నా ఇంటి తాళాలు రాజ్ తరుణ్ వద్ద ఉన్నాయి అయితే ఇప్పుడు నేను ముంబైలో ఉన్న ఆ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ తన బంగారంతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా లేవని అవన్నీ తానే దొంగలించి ఉంటారు అంటూ ఈమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మరోసారి వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.