కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడిని కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రామ్మోహన్నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరఫున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల రామ్మోహన్నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను మరింత బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడంతో పాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Also Read: ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త: సజ్జనార్!
[vuukle]