Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం రెండవ వారం పూర్తి కావస్తుంది. ఇప్పటికే మొదటివారం పూర్తి చేసుకుని హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు. 14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండవ వారంలో కూడా నామినేషన్స్ లో విష్ణుప్రియ, సీత, నిఖిల్, మణికంఠ, పృథ్వి, ఆదిత్య ఓం, శేఖర్ బాషా వంటి వారు నామినేషన్స్ లో ఉన్నారు.

ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకి వస్తారు అనే విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే విష్ణు ప్రియ ఈ నామినేషన్స్ లో ఓటింగ్లో ముందంజలో ఉన్నారు. ఈమె తర్వాత నిఖిల్ ఉన్నారు. ఇక చివరి స్థానంలో పృథ్వి, సీత ఉన్నారు. నిజానికి పృథ్వి కంటే సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ ఆమె పిఆర్ టీమ్ సరిగా పనిచేయకపోవడంతో తను ఓటింగ్లో వెనక పడిపోయిందని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే రెండవ వారం కూడా కిరాక్ సీత హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది. అయితే వీరి మధ్య చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ డిఫరెన్స్ ఉన్న నేపథ్యంలో ఈరోజు కూడా పోలయ్యే ఓట్లను బట్టి ఎవరు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారనేది తెలియనుంది. ఇప్పటికైతే సీత వెనకంజలో ఉన్న నేపథ్యంలో ఈమె హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది.

కిరాక్ సీత..
ఇక మొదటివారం హౌస్ నుంచి అమ్మాయిని బయటకు పంపించారు. ఇక రెండవ వారం కూడా మరోసారి అమ్మాయిని పంపించడంతో బిగ్ బాస్ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారా అని అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో కూడా వరుసగా అమ్మాయిలను హౌస్ నుంచి బయటకు పంపిన సంగతి తెలిసిందే.