ఈ వార్తను అనువదించండి:

ఈనెల 20న తెలంగాణ కేబినెట్ బేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టం, కేంద్రం నుంచి రావాల్సిన పరిహారం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మిగిలిన ఎన్నికల హామీల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులపై కూడా చర్చించే అవకాశం ఉంది. రైతు రుణమాఫీలో సమస్యలతో పాటు రైతు భరోసా పథకం రూల్స్ పై సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పూర్తిగా చదవండి..