ఈ వార్తను అనువదించండి:

బట్టి విక్రమార్క: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ‘ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ 200వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తాం’ అని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

పూర్తిగా చదవండి..