ఈ వార్తను అనువదించండి:

YS Jagan: గణేశ్‌ నవరాత్రులు సందర్భంగా జరిగిన ఓ శోభాయాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ని కీర్తిస్తూ పాటలు పెట్టి..ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు కొందరు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో శుక్రవారం జరిగింది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బి.కొత్తకోట మండల కేంద్రంలో కొన్ని ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటుచేసి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక పోకనాటివీధిలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని సెప్టెంబరు 13న నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చేపట్టిన ఊరేగింపు స్థానిక జ్యోతి బస్టాండుకు వద్దకు వచ్చింది.

పూర్తిగా చదవండి..