ఈ వార్తను అనువదించండి:

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి బీజేపీకి 370 సీట్లు.. మొత్తం ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బీజీపీకి 240 మాత్రమే సీట్లు వచ్చాయి. మొత్తంగా ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించింది. చివరికి బీజేపీ ఎన్డీయే కూటమి పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియా కూటమి 234 సీట్లు సాధించి ఎన్డీయేకు పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో గత పదేళ్లుగా కేంద్రంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభావం తగ్గిపోతుందని.. ఇండియా కూటమి ప్రభావం పెరుగుతోందని నెటీజన్లు భావిస్తున్నారు.

పూర్తిగా చదవండి..