ఈ వార్తను అనువదించండి:

రఘురామరాజు: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, తమ రాజకీయ భవిష్యత్తు గురించి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ రాజు RTVతో సంచలన విషయాలపై ఓపెన్ అయ్యారు. మంత్రి పదవి, స్పీకర్, టీటీడీ చైర్మన్, ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవులు వస్తాయని ప్రచారం జరిగినప్పటికీ అందని ద్రాక్షగానే మిగలడానికి కారణం ఏమీటిటే దానిపై మనసులో మాట బయటపెట్టారు. ఇందులో రెండు అవకాశాలు పోయినా.. ఇంకా రెండు మిగిలే ఉన్నాయన్నారు. ఇక చంద్రబాబు తనను ఎందుకు చాయిస్ గా తీసుకోవట్లేదంటే.. తనలో లోపం ఏమీలేదని, కారణం ఏంటో తనకు తెలియదన్నారు. ఇక రాజకీయ నిలకడ లేని కారణంగా చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వట్లేదనే ఆరోపణలను ఖండించారు. జగన్ కోసం చాలా చేశానని, కానీ తనమీదే రాజ్యద్రోహం కేసు పెట్టిన జగన్ ఒక మూర్ఖుడన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

పూర్తిగా చదవండి..