ఈ వార్తను అనువదించండి:

ఏపీ కేబినెట్ మీట్: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటి పైనా కేబినెట్‌లో ప్రస్తావన రానున్నట్లు సమాచారం. అలాగే విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు వాగుపై కూడా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పూర్తిగా చదవండి..