Health Tips: ఆరోగ్యంతో హెల్తీగా ఉండాలంటే మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వలన అనేక సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. వాటిల్లో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే మనకి చాలా ఇబ్బందిగా, కడుపులో నొప్పి కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. రోజుకు ఐదు లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతారు. అయితే చాలామంది నీటిని రోజు మొత్తంలో ఐదు లీటర్ల నీళ్లు తాగాలని అంటారు. కానీ అలా తాగటం వల్ల ఉపయోగాలు చాలా తక్కువగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

Also Read :  Ganesh Nimajjanam : నిమజ్జనానికి 600 స్పెషల్ బస్సులు.. వారికి ఫ్రీ!

Kidney Stones

ఎప్పుడైనా సరే నీటిని ఉదయం పూట తీసుకుంటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉదయం పూట నీటి ఎలా తీసుకోవాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉదయం పూట నీరు ఎక్కువగా తాగడం వలన ఈ నీరంతా రక్తంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధి చేసి యూరిన్ రూపంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది.

Also Read :  ఈ కామెడీ సిరీస్‌కు అవార్డుల పంట.. ఎమ్మీ అవార్డ్స్ విజేతల జాబితా ఇదే!

అందుకని ఉదయం పూట నీటిని ఎక్కువగా తాగటం వలన ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముందుగా రెండు లీటర్ల నీళ్లు తాగి కొంచెం సమయం ఇవ్వాలి. యూరిన్ పోయిన తర్వాత మరో రెండు లీటర్లను తాగాలి. ఇలా రోజూ ఉదయం పూట తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు కరగడంతో పాటు యూరిన్‌లో రాళ్లు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read :  హీరో సిద్దార్థ్- అదితి పెళ్లి ఫొటోలు వైరల్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  గణేష్ ఉత్సవాల్లో విషాదం.. డాన్స్ చేస్తూ అక్కడిక్కడే..!