బాలినేని శ్రీనివాసరెడ్డి వలన ప్రతి టీడీపీ కార్యకర్త ఇబ్బంది పడింది వాస్తవం అని ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని జనసేన పార్టీలోకి రావడం వలన టీడీపీ కి వచ్చే నష్టం ఏమి లేదు.. రాదు అని అన్నారు. బాలినేని తో కలిసి పనిచేయాల్సి వస్తె పార్టీ ఆదేశాలు..అధిష్టానం సూచనమేర ముందుకెళ్తాం అని పేర్కొన్నారు. కాగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ అయ్యారు. చేరికపై ఆయన పవన్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కూడా…
జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తన అనుచరులకు పార్టీ మార్పుపై సమాచారం ఇచ్చారు. ఆర్టీవీతో అయన ఎక్సక్లూజివ్ గా మాట్లాడుతూ.. తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రేపు జగ్గయ్యపేటలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. తన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జనసేన కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
[vuukle]