• నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు
  • బాలకృష్ణ ఆసక్తికర పోస్ట్‌
  • ఏఎన్నార్‌ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి

పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా.అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఏఎన్నార్‌ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం అని అన్నారు.

Also Read: Devara: ‘దేవర’ కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?.. ఎన్టీఆర్ కెరీర్లోనే స్పెషల్!

‘తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికి ప్రేరణ. ఈ రోజు ఆయనకు మనందరం నివాళి అర్పిస్తూ.. ఆయన నటన, కృషి మరియు పట్టుదలతో సాధించిన విజయాలను స్మరించుకుందాం’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.