• దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం.
  • లడ్డు వివాదంపై స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్
  • ఘాటుగా రిప్లై ఇచ్చిన మంచు మనోజ్.

Manchu Vishnu – Prakash Raj: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా లడ్డు తయారీ విషయంలో నాసిరకం నెయ్యిని వాడారంటూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు. అయితే ఈ విషయంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేశాడు.

Devara : ఏపీ ప్రభుత్వానికి ‘నందమూరి బ్రదర్స్’ కృతఙ్ఞతలు.. ట్వీట్స్ వైరల్

ఇందులో భాగంగా.. తిరుమల వివాదం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. విచారణ చేసి దోషులను శిక్షించండి. దాని కోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకని..? జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ.. సోషల్ మీడియా వేదికగా వివాదానికి తెర లేపాడు. అయితే ఈ విషయం సంబంధించి తాజాగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ నటుడు విష్ణు మంచు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ..

Aha : ఆహాలో దూసుకుపోతోన్న ‘టీనేజర్స్ 17/18’

ప్రకాష్ రాజు గారు మీరు కాస్త తగ్గండి.. తిరుమల ప్రసాదం లడ్డు అంటే.. కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే కాదని మాలాంటి కోట్ల మంది భక్తుల విశ్వాసమని., హిందువుల విశ్వాసానికి ప్రతికంటూ తెలుపుతూనే.. అందుకు సమగ్ర విచారణ చేయిస్తారని.. ధర్మరక్షణకు చర్యలు తీసుకుంటారని.. మీరు మీ హద్దుల్లోనే ఉంటే మంచిది అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తూ.., మీలాంటి వారు ఇలాంటి వాటిలో స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అంటూ గట్టిగా రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ విషయం మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. మా అసోసియేషన్ ఎన్నికల నేపథంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఎన్నికల పోరు జరిగిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీంను విష్ణు ఓడించి మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. లడ్డు వ్యవహారంలో ప్రకాష్ రాజ్ వ్యవహరించిన తీరు చూస్తే ఇప్పుడు ఆయనను టాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత దూరం చేసేలా కనిపిస్తోంది.