Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి జాన్వీ కపూర్. ఈమె ఇదివరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన మొదటిసారి దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించాలని భావించారు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడటంతో చిత్ర బృందం వరుస వీడియోలను విడుదల చేస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి జాన్వీ కపూర్ ఒక వీడియోని విడుదల చేశారు అయితే ఈ వీడియోలో ఈమె తెలుగులో మాట్లాడటం విశేషం.

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నన్ను ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఎన్టీఆర్ అభిమానులు నన్ను ఎంతో ముద్దుగా జాను పాపా అంటూ పిలుస్తుండడం చాలా సంతోషంగా ఉంది ఇక మా అమ్మ అంటే మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అలాగే అమ్మకు కూడా మీరు అంతే ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడే రోజు కోసం కష్టపడతానని తెలిపారు..

జానూ పాప…

ఇక దేవర సినిమాలో నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే ఈ విషయాలన్నింటినీ స్వయంగా తాను ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు. అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అంటూ ఈ సందర్భంగా జాన్వీ ఎంతో ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.