2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక జంటగా 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి నటించిన హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సత్యం సుందరం ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. రెండు ప్రధాన పాత్రలు, వారి మధ్య భావోద్వేగ బంధాన్ని పరిచయం చేసే టీజర్‌తో మేకర్స్ ఇటీవల ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అరుణ్‌-అరవింద్ స్వామి తన పూర్వీకుల ఇంటికి తిరిగి రావడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ స్థలం పట్ల అతనికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, అరుణ్‌ని అతని గతం వెంటాడుతుంది. తన స్వగ్రామంలో ఒక ఏమీ తెలియని పల్లెటూరి వ్యక్తయిన తన బంధువు కార్తీతో సన్నిహిత బంధాన్ని ఏర్పరుచుకుంటాడు.

Oscars: కల్కి 2898 ఏడీ-హనుమాన్ సహా ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీకి పోటీ పడిన 29 సినిమాలివే!

ఇక ఈ ట్రైలర్ కి గోవింద్ వసంత అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ప్లస్ అయింది. ప్రేమ్ కుమార్ అన్ని భావోద్వేగాలను నేర్పుగా మిళితం చేశాడని చెప్పొచ్చు. భావోద్వేగ కథలను హ్యాండిల్ చేయడంలో తన నైపుణ్యాన్ని ఆయన మరోసారి నిరూపించుకున్నాడు. అరవింద్ స్వామి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడుతుండగా, కార్తీ అందుకు భిన్నంగా బిగ్గరగా, నిజాయితీగా ఉంటాడు. వారి విరుద్ధమైన వ్యక్తిత్వాలు హాస్యభరితమైన, హృద్యమైన ప్రయాణానికి వేదికగా నిలుస్తూ మంచి వినోదభరితమైన అనుభవాన్ని ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సత్యం సుందరం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.