Mahesh Babu Gives Rs 10 Lakh donation to Telangana from AMB: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. నేడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల చెక్‌ను మహేష్ బాబు దంపతులు అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. చెక్‌ను అందజేశారు. అంతేకాదు ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10 లక్షలు విరాళంను కూడా సూపర్ స్టార్ అందించారు.