Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో హీరో కార్తీకు తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అసలు కార్తీ పై పవన్ సీరియస్ కావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

కార్తీ ఇటీవల సత్యం సుందరం అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన లడ్డు గురించి మాట్లాడారు.. లడ్డు కావాలా నాయనా అని మీమ్ గురించి కార్తీ స్పందిస్తూ.. లడ్డు ప్రస్తుతం సెన్సిటివ్ ఇష్యూ గా మారిపోయింది దీని గురించి మాట్లాడకపోవడమే మంచిది అంటూ కామెంట్లు చేశారు..

ఈ విధంగా లడ్డు గురించి కార్తీ చేసిన ఈ కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… లడ్డు మీద జోక్స్ వేస్తున్నారు ఓ సినిమా ఈవెంట్లో లడ్డు అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ అంటూ ఓ హీరో మాట్లాడారు. మరోసారి ఇలా మాట్లాడొద్దు మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడండి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సనాతన ధర్మాన్ని కాపాడండి..
ఈ విధంగా పవన్ కళ్యాణ్ హీరో కార్తీ పేరు ప్రస్తావించక పోయిన ఆయనకే వార్నింగ్ ఇచ్చారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లపై హీరో కార్తీ స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.