• బుల్లితెరపై రష్మి గౌతమ్ హవా
  • సోషల్ మీడియాలో రష్మి వీడియో వైరల్
  • ఎక్స్‌లో రష్మి పోస్ట్‌

Rashmi Gautham Post Goes Viral: ‘రష్మి గౌతమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన రష్మి.. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మరోవైపు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా రష్మి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రష్మి గౌతమ్ గతంలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైన వేళ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో తాజాగా రష్మి ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 2020లో తాను మాట్లాడాడని, దయచేసి ఇప్పుడు ఆ వీడియోను వాడొద్దని విజ్ఞప్తి చేశారు. ‘మైనర్‌ను అత్యాచారం చేయడం వేరు, క్యాస్టింగ్‌ కౌచ్‌ వేరు. 2020 కంటే ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నేను క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడా. దయచేసి ఆ వీడియోను ఇప్పుడు వాడొద్దు. జనాలను తప్పుదోవ పట్టించవద్దు. పని ప్రదేశాలు సురక్షితంగా ఉండాలి. ఓ మహిళ నో అని చెప్పిందంటే.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’ అని పేర్కొన్నారు.

Also Read: Devara Ticket Prices: ‘దేవర’ టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్!

బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెరపై మాత్రం రష్మికి అదృష్టం కలిసి రావడం లేదు. గుంటూరు టాకీస్ సక్సెస్ కాగా.. ఆపై వచ్చిన తను వచ్చేనంటా, అంతం, బొమ్మ బ్లాక్‌బస్టర్‌, అంతకుమించి లాంటి చిత్రాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఫుల్ ఫోకస్ టీవీ షోలపైనే పెట్టారు.